RTE 2009
ఉచిత, నిర్భంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు చట్టం – 2009
The Right of Children to Free and Computlosry Education Act 2009
6 నుండి 1-14 సంవత్సరముల పిల్లలందరు బడిలో చేరి, ఉచితంగా చదువుకోవడానికి ఉద్దేశించిన చట్టం ఉచిత, నిర్భంధ విద్య బాలల హక్కు చట్టం,2009 దీనిని ఆగష్టు 27 వ తేదిన పార్లమెంటు ఆమోదించింది.
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
- పాఠశాలకు మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించాలి.
- పిల్లలను బడిలో చేర్చడం తల్లిదండ్రుల బాధ్యత.
- బడిలో ప్రవేశానికి ఎంపిక విధానం, క్యాంపిటేషన్ రుసుం ఉండదు.
- బడిలో చేరిన పిల్లల పేరు తీసివేయడం, ఆదే తరగతిలో కొనసాగించడం నిషేధం.
- పిల్లల్ని శారీరకంగా, మానసికంగా వేదించడం నిషేధం
- వయస్సు నిర్ధారణ పత్రం , ఇతర ధృవీకరణ పత్రాలు లేవనే కారణం చేత పిల్లలకు బడిలో ప్రవేశాన్ని నిరాకరించరాదు.
- గుర్తింపు లేకుండా పాఠశాలలు ప్రారంభించరాదు. ప్రారంభిస్తే రూ.లక్ష జరిమానా విధించవచ్చు.
- అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయాలి.
- నిర్ధారిత అర్హతలున్న వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి.
- పిల్లల సర్వతోముఖాభివృద్ధి జరిగేలా బోధనాభ్యసనం, మూల్యాంకనం ఉండాలి.
- ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు, ప్రైవేటు బోధనా పనులు నిర్వహించరాదు.
- నిర్ణీత స:క్యలో ఉపాధ్యాయుల పోస్టులను, అవసరమైన తరగతి గదులను మంజూరుచేయాలి.
- ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు బోర్డు పరీక్షలు ఉండవు.
- ఎయిడెడ్, ఆన్- ఎయిడెడ్ పాఠశాలలు కనీసం 25 శాతం వరకు ప్రతి సంవత్సరం 1వ తరగతిలో పేద పిల్లలను చేర్చుకోవాలి. వీరి ఫీజుల ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది.
బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం : బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ లేదా విద్యా హక్కు రక్షణ సంస్థ (REPA) ను ఏర్పాటు చేయాలి.